News January 18, 2025
ప్రకాశం: ఒకే రోజు జిల్లాలో నలుగురు మృతి

వివిధ కారణాలతో ఒకేరోజు జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. మార్కాపురం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నారాయణ మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, కనిగిరికి చెందిన అనంతమ్మ క్యాన్సర్తో బాధపడుతూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రహదారి ప్రమాదంలో ప్రతాప్ మృతిచెందగా, కురిచేడులో యశ్వంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Similar News
News February 7, 2025
చీమకుర్తి: 6 పేజీల సూసైన్ నోట్తో మృతి

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోనికి వెళ్తే.. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకి కారణం అయ్యుండొచ్చని స్థానికులు తెలిపారు. ఆత్మహత్య చేసుకునే ముందు శీను రాసిన ఆరు పేజీల లేఖను తన జేబులో గుర్తించారు. ‘నా ఇద్దరు పిల్లలు జాగ్రత్త’ అంటూ తాను రాసిన లేక గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
News February 7, 2025
ఒంగోలు: విద్యాశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్

పాఠశాలల పునఃనిర్మాణానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రతి మండలం నుంచి తయారు చేయబడిన పీపీటీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం రివ్యూ చేశారు. మండల విద్యాశాఖాధికారులు తయారు చేసిన పీపీటీల ద్వారా వారి మండలాలలో పాఠశాల పునఃనిర్మాణం చేపట్టిన తరువాత ఏర్పాటుచేయబోయే పాఠశాలల వివరాలు తగిన ఆధారాలతో కలెక్టర్కి వివరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News February 6, 2025
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.