News February 6, 2025

ప్రకాశం: ఒకే రోజు ముగ్గురు మృతి

image

ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ ఘటనలలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం కంబలపాడు కి చెందిన సుబ్బరత్తమ్మ పొలంలో విద్యుత్ షాక్‌కి గురై మరణించారు. దర్శి మండలానికి చెందిన నారాయణమ్మ పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మరణించారు. అలాగే వరికుంటపాడు నుంచి పామూరు వస్తున్న బాలయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు.

Similar News

News March 15, 2025

ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

image

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.

News March 15, 2025

ప్రకాశం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఎంతమంది రాస్తున్నారో తెలుసా?

image

ప్రకాశం జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 183 ఎగ్జామ్ సెంటర్లలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లుగా డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. బాలురు 14,994 మంది, బాలికలు 14,608 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లుగా వెల్లడించారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు.

News March 15, 2025

ప్రకాశం జిల్లా టీచర్‌కు నేషనల్ అవార్డు

image

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.

error: Content is protected !!