News November 19, 2024
ప్రకాశం: ఒక బిడ్డ జననం.. క్షణాల్లో మరో బిడ్డ మరణం

దోర్నాలలో ఓ తల్లికి బిడ్డకు జన్మనిచ్చానన్న ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకుండా పోయింది. బాధితుల వివరాల ప్రకారం.. దోర్నాల మండలం నందిగూడేనికి చెందిన గురవయ్య భార్య వీరమ్మ సోమవారం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆమెను చూడటానికి అతడు, తన కూతురు పల్లవి అలాగే ఆశా వర్కర్ నాగమ్మను బైక్పై బయల్దేరారు. కొత్తూరు సమీపంలోకి రాగనే వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లవి(2), నాగమ్మ(36) అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News December 23, 2025
బాలినేనికి.. నామినేటెడ్ పదవి ఖాయమేనా?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది. పదవి బాధ్యత కార్యక్రమంలో బాలినేని పేరెత్తి మరీ జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని పవన్ ప్రకటించగా.. ఈ జాబితాలో బాలినేని పేరు ఖాయమని ప్రచారం సాగుతోంది. అలాగే పార్టీలో కీలక పదవి దక్కే అవకాశాలు ఉన్నాయట.
News December 23, 2025
ప్రకాశం: వలస కూలీతో ఎఫైర్.. భర్తను చంపిన భార్య

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ భార్య హత్య చేసింది. ఈ ఘటన HYDలోని బోడుప్పల్లో జరిగింది. అక్కడ నివసించే అశోక్(45), పూర్ణిమ(36) భార్యాభర్తలు. ప్రకాశం జిల్లాకు చెందిన వలస కూలీ మహేశ్(22)తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 11న అశోక్ను పూర్ణిమ, మహేశ్, సాయికుమార్ కలిసి కింద పడేసి చున్నీలతో గొంతు బిగించి హత్య చేశారు. గుండెపోటుగా చిత్రీకరించినా, పోలీసుల విచారణలో నిజం తేలింది.
News December 23, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు రానున్న భారీ పరిశ్రమ

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ, సంతమాగులూరు మండలాలో 1,591.17 ఎకరాల భూమిని సేకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


