News December 5, 2024

ప్రకాశం: కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గురువారం తీవ్ర విషాద ఘటన జరిగింది. కొనకనమిట్ల మండలం సిద్దవరం శివారులోని నిమ్మతోటలో విద్యుత్ లైన్లు లాగుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. మృతులు పెద్దారవీడుకు చెందిన నాగరాజు (28), రంగారావు(30)గా గుర్తించారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Similar News

News November 28, 2025

ప్రకాశం జిల్లా వాసులకు గుడ్ న్యూస్..!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్తంగా శుక్రవారం పామూరు ఈటీఎన్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుబ్బారావు తెలిపారు. 10, ఇంటర్, డిగ్రీ, ఆపై చదివిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. నెలకి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం వస్తుందన్నారు. పూర్తి వివరాలకు. 99888 53335 నంబరును సంప్రదించాలన్నారు.

News November 28, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు.

News November 28, 2025

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందన్నారు.