News October 14, 2024
ప్రకాశం: కారు బోల్తా.. ఇద్దరు మృతి
ఉమ్మడి ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. నలదలపూరులో జరిగిన వివాహానికి కొందరు హాజరయ్యారు. తిరిగి కారులో పోకూరుకు బయల్దేరారు. కొండారెడ్డిపాలెం వద్ద సోమవారం తెల్లవారుజామున కారు బోల్తాకొట్టింది. సామ్రాజ్యం(65), సులోచన(55) ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్కు, మిగిలిన వారిని కందుకూరు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 15, 2024
మాగుంటకు విజయసాయి రెడ్డి విషెస్
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వైసీపీ MP విజయసాయిరెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్నికల ముందు వరకు వైసీపీలో కొనసాగిన ఎంపీ మాగుంట అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో TDPలో చేరారు. ఒంగోలు ఎంపీగా విజయాన్ని సైతం అందుకున్నారు. అయితే ఎంపీ మాగుంట పుట్టినరోజు సందర్భంగా విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
News October 15, 2024
ప్రకాశం ఎస్పీకి కీలక బాధ్యతలు
సంచలన కేసులను క్లియర్ చేసిన ఘనత ప్రకాశం ఎస్పీ దామోదర్కు ఉంది. గతంలో ఆయన మన జిల్లాలోనే ప్రొబేషనరీ డీఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో దేశంలో సవాల్గా మారిన హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ను కటకటాల్లోకి నెట్టారు. ఇలా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనను ఉండి MLA రఘురామకృష్ణ రాజు(RRR) హత్యాయత్నం కేసు దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ కేసులో మాజీ సీఎం జగన్ హస్తం ఉందని RRR ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
News October 15, 2024
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం కలెక్టర్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తీర ప్రాంతంలో ఉండే ప్రజలు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం పాకల, ఊళ్లపాలెం గ్రామాలలోని పునరావాస కేంద్రాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో ఉండే ప్రజలు వర్షాలకు బయటకు రావద్దన్నారు.