News March 21, 2025
ప్రకాశం జిల్లాలోని ఆ ప్రాంతాలలో ఎన్నికలు

ప్రకాశం జిల్లాలో మార్కాపురం MPP, త్రిపురాంతకం MPP, పుల్లలచెరువు వైస్ MPP, ఎర్రగొండపాలెం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికలను ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం తెలిపారు. 23వ తేదీన సభ్యులకు నోటీసులు అందించాలన్నారు. 27వ తేదీన MPP, వైస్ MPP పదవులకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపిక చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 1, 2025
ప్రకాశం: పింఛన్ నగదు మాయం

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.
News April 1, 2025
పెదచెర్లోపల్లి: అధికారులతో కలెక్టర్ సమీక్ష

పెద చెర్లోపల్లి మండలంలో దివాకరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పర్యటించారు. గ్రామంలో బుధవారం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేశ్, అనంత్ అంబానీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్రతో కలసి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.
News April 1, 2025
రేపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

ఒంగోలు కలెక్టరేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ ఎర్రయ్య మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సీపీఎస్, జీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు