News April 16, 2024

ప్రకాశం జిల్లాలో ఓటు నమోదుకు 8,320 దరఖాస్తులు

image

ప్రకాశం జిల్లాలో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ క్రమంలో జిల్లాలోని 8 నియోజకవర్గాల నుంచి ఓటు హక్కు నమోదు కోసం 8,320 దరఖాస్తులు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు పరిశీలించి సంబంధిత బిఎల్ఓ‌లకు పంపారు. వారం రోజుల్లో ఓటు హక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను విచారణ చేసి అర్హత ఉంటే ఓటు హక్కు కల్పించనున్నారు.

Similar News

News April 22, 2025

యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

image

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.

News April 22, 2025

యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి

image

యానాదుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి చెప్పారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో యానాది సంఘం ప్రతినిధులు మంత్రిని కలిశారు. యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రిమిటివ్ ట్రైబల్ జాబితాలో తమను చేర్చాలని కోరారు. జనాభా దామాషా ప్రాతిపదికన చట్టసభల్లో యానాది సామాజిక వర్గానికి ప్రాధాన్యతివ్వాలని వినతిపత్రం అందజేశారు.

News April 22, 2025

కేవీపీఎస్ సాంస్కృతిక కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ

image

కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించే సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం ఆవిష్కరించారు. కేవీపీఎస్ సామాజిక సాంస్కృతిక ఉత్సవాలు-2025లో భాగంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జీవిత చరిత్రపై ఒంగోలు అంబేడ్కర్ భవనంలో మే 8న, అలాగే మద్దిపాడులోని నటరాజ్ కళాక్షేత్రంలో మే 9న నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. కలెక్టర్ పాల్గొని తిలకించాలని ఆహ్వానించారు.

error: Content is protected !!