News May 4, 2024

ప్రకాశం జిల్లాలో తొలి ఓటరు నాగలక్ష్మీబాయి

image

ప్రకాశం జిల్లాలో మొదటి ఓటరుగా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజన గూడేనికి చెందిన జండా వత్ నాగలక్ష్మీ బాయి స్థానం సంపాదించుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో మొదటి బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే ఓటరు జాబితా కూడా ప్రారంభమవుతుంది. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్ జీపులను వినియోగిస్తున్నారు.

Similar News

News November 26, 2025

త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

News November 26, 2025

దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్‌గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

image

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.

News November 26, 2025

దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్‌గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

image

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.