News May 4, 2024
ప్రకాశం జిల్లాలో తొలి ఓటరు నాగలక్ష్మీబాయి

ప్రకాశం జిల్లాలో మొదటి ఓటరుగా యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజన గూడేనికి చెందిన జండా వత్ నాగలక్ష్మీ బాయి స్థానం సంపాదించుకున్నారు. యర్రగొండపాలెం మండలంలోని పాలుట్ల గిరిజనగూడెంలో మొదటి బూత్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచే ఓటరు జాబితా కూడా ప్రారంభమవుతుంది. మైదాన ప్రాంతం నుంచి పాలుట్ల చేరుకోవడానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు పాలుట్ల వెళ్లేందుకు ప్రత్యేక కమాండర్ జీపులను వినియోగిస్తున్నారు.
Similar News
News December 12, 2025
ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రూ.10 కోట్లతో పనులు

ఒంగోలు రిమ్స్ వైద్యశాల అభివృద్ధికి సుమారు రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కలెక్టర్ రాజబాబు వెల్లడించారు. ఆసుపత్రిని ఆయన శుక్రవారం సందర్శించారు. రోగులకు అందించాల్సిన వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలు సూసైడ్.!

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యాభర్తలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దంతరపల్లికి చెందిన ఈ దంపతులు 5 నెలలక్రితం అదృశ్యమయ్యారు. అప్పుల బాధతో ఇంటి నుంచి వెళ్లిపోయిన వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News December 12, 2025
ప్రకాశం జిల్లా TDP అధ్యక్ష పదవి.. ఛాన్స్ ఉగ్రాకేనా?

ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇంకా భర్తీ కాని విషయం తెలిసిందే. కొన్ని నెలలక్రితం ఇక అధ్యక్ష పదవి భర్తీ అవుతుందని క్యాడర్ భావించినా TDP అధిష్ఠానం మాత్రం ఆచీతూచీ అడుగులు వేస్తోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి పలువురి పేర్లు తెరపైకి వచ్చినా, అధిష్ఠానం రాజకీయ సమీకరణాల ప్రకారం నిర్ణయం తీసుకోనుందట. తాజాగా కనిగిరి MLA ఉగ్ర నరసింహారెడ్డి పేరు అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మీ కామెంట్.


