News October 21, 2024
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Similar News
News December 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
News December 3, 2025
ప్రకాశం: ఆకలితో అలమటించిన విద్యార్థులు.. వార్డెన్ సస్పెండ్.!

విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
News December 3, 2025
ప్రకాశం: ఆకలితో అలమటించిన విద్యార్థులు.. వార్డెన్ సస్పెండ్.!

విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.


