News October 21, 2024

ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

image

చంద్రశేఖరపురం మండలం డీజీపేటకు చెందిన వృద్ధురాలు డేగ రత్తమ్మ (58) హత్యకు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం గడ్డికోసం రత్తమ్మ పొలం వెళ్లారు. పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు అమెను హత్యచేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, కమ్మలు దొంగిలించారు. సాయంత్రమైనా రత్తమ్మ ఇంటికి రాలేదని స్థానికులు పొలానికి వెళ్లి చూడగా హత్యకు గురైంది. పామూరు CI, చంద్రశేఖరపురం SI ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Similar News

News September 16, 2025

ప్రకాశం: ప్రభుత్వ కళాశాలలో వికృతి చేష్టలు.. ఐదుగురిపై వేటు

image

ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.

News September 16, 2025

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

image

తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంతో సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ తాడేపల్లికి వెళ్లారు. ఈ దశలోనే కలెక్టర్ల సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

News September 15, 2025

ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.