News November 9, 2024
ప్రకాశం జిల్లాలో నేడు ప్రత్యేక శిబిరాలు

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారిణి తమీమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9, 10, 23, 24వ తేదీల్లో ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అర్హులైన వారి నుంచి ఫారం-6,7,8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్!

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల అర్జీల పరిష్కారం అనంతరం సంబంధిత దరఖాస్తు దారుడుకి అధికారులు స్వయంగా ఫోన్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించాలని, అలాగే అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ విషయాన్ని అధికారులందరూ గుర్తించాలన్నారు.
News November 3, 2025
టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

టంగుటూరు శ్రీనివాసనగర్కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్లో సాప్ట్వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.
News November 3, 2025
ప్రకాశం: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలామంది వాట్సాప్ గ్రూపులను దుష్ప్రచారానికి వాడుతున్నారు. తెలిసీతెలియక గ్రూపుల్లో వచ్చే తప్పుడు సమాచారాన్ని క్రాస్ చెక్ చేయకుండా షేర్ చేస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు ఇస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టింగులు చేసినా? తప్పుడు ప్రచారం చేసినా అడ్మిన్లు బాధ్యత వహించాలని చెబుతున్నారు. మీకూ నోటీసులు ఇచ్చారా?


