News May 10, 2024
ప్రకాశం జిల్లాలో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. జిల్లా మొత్తంలో ఒంగోలు ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉద్యోగులు 99.07% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉద్యోగులు అత్యధికంగా దర్శిలో 98.76% మంది ఓటేశారు. నియోజవర్గాల వారీగా చూస్తే సంతనూతలపాడు 97.52, ఒంగోలు 97.28, కొండపి 96.24, మార్కాపురం 90.89, గిద్దలూరు 94.64, కనిగిరి 93.80 శాతాలుగా నమోదయ్యాయి.
Similar News
News March 7, 2026
పెద్ద దోర్నాల వద్ద ప్రమాదం.. యువకుడు స్పాట్డెడ్

పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెలుగొండ ప్రాజెక్టు వైపు వెళ్తున్న వింగర్ బొమ్మలపురం చెంచు కాలనీ వైపు వెళ్తున్న ఓ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 7, 2026
10th పరీక్షల నిర్వహణపై కలెక్టర్, SP సమీక్ష

10వ తరగతి పరీక్షల నిర్వహణలోఎలాంటి లోపాలు లేకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులతో ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్తో కలిసి జిల్లాలోని పరిస్థితిపై కలెక్టర్ సమీక్షించారు. 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు జరుగుతాయని DEO తెలిపారు.
News March 7, 2026
ప్రకాశం: మహిళా దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా జరిపించాలని సూచించారు. రవాణా, భోజనం, సాంకేతిక ఏర్పాట్లలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.


