News February 27, 2025

ప్రకాశం జిల్లాలో స్వయంగా గస్తీ చేపట్టిన SP

image

త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి దేవస్థానం, శ్రీమత్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానాల వద్ద భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ బుధవారం రాత్రి పరిశీలించారు. ఉత్సవాల సమయంలో దొంగతనాలు, అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు. అలాగే తిరునాళ్ల సందర్భంగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా వేడుకలు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

Similar News

News December 13, 2025

ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News December 13, 2025

ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

image

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News December 13, 2025

ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

image

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.