News November 14, 2024
ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ

ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సీఐలు బదిలీ అయినా ఏఎస్ఐలకు రిలీవింగ్ ఆర్డర్లను ఇవ్వాలని, బదిలీ అయినా పోలీస్ స్టేషన్ వివరాలను వారికి తెలపాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
Similar News
News November 18, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News November 18, 2025
ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

ఆన్లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
News November 18, 2025
ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.


