News October 12, 2024
ప్రకాశం జిల్లాలో 28 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మద్యం తాగి వాహనాలను నడిపే వారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. జిల్లాలో బ్రీత్ ఎనలైజర్ ద్వారా తనిఖీలు నిర్వహించి, 28 కేసులను నమోదు చేశారు. అలాగే సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 468 మంది వాహనదారులకు జరిమానా విధించామన్నారు. మొత్తం రూ.1,00,365ల జరిమానా వసూలైనట్లు, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలన్నారు.
Similar News
News December 2, 2025
ఒంగోలు:17 ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు నోటీసులు

జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న ఎయిడెడ్ స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధమైంది. అలాంటి 17 పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో కిరణ్ కుమార్ తుది సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. వీటిలో 14 స్కూళ్లలో 40 మందిలోపు, మూడు స్కూళ్లలో 20 మందిలోపు విద్యార్థులున్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం 2సార్లు నోటీసులు జారీచేసినా స్కూల్ యాజమాన్యాలు స్పందన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 2, 2025
ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.
News December 2, 2025
ప్రకాశం జిల్లా మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం జిల్లాలోని మొక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రైతులకు మేలు చేకూర్చేలా జేసీ గోపాలకృష్ణ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మొక్కజొన్న వినియోగించే ఫ్యాక్టరీస్ యజమానులతో జేసీ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల వద్ద ఫ్యాక్టరీ యజమానులు తప్పక పంటను కొనుగోలు చేయాలన్నారు.


