News August 3, 2024
ప్రకాశం జిల్లాలో 40 మంది తహశీల్దార్ల స్థానచలనం

జిల్లాలోని 40 మంది తహశీల్దార్లకు బదిలీలు జరిగాయి. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పొరుగు జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు ఇటీవల కలెక్టరేట్లో పోస్టింగ్ నిమిత్తం రిపోర్టు చేశారు. వారితోపాటు, స్థానికంగా విధులు నిర్వహిస్తున్న కొందరికి స్థానచలనం కల్పిం చారు. కొండపి, సింగరాయకొండ, జరుగుమల్లి, ఒంగోలు డీఏవో తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Similar News
News November 25, 2025
ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.
News November 25, 2025
ప్రకాశం: సందేహాలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.!

పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. పదవతరగతి ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్ సమయంలో ఇబ్బందులు ఉన్నయెడల వాటి పరిష్కారానికి స్పెషల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే 9848527224, 8985601722కు సంప్రదించాలన్నారు.
News November 25, 2025
మళ్లీ ప్రకాశంలోకి అద్దంకి నియోజకవర్గం?

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి పరిపాలన దృష్ట్యా బాపట్లలో చేర్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా అద్దంకిని ప్రకాశంలో కలిపి, రెవెన్యూ డివిజన్గా మార్చేందకు ఉపసంఘం ప్రతిపాదించింది. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం


