News September 28, 2024
ప్రకాశం జిల్లాలో 42,033 కౌలు రైతు కార్డులు జారీ

ప్రకాశం జిల్లాలో ఖరీఫ్ సీజన్ కింద కౌలు రైతులకు 45వేల కార్డులను జారీ చేసేందుకు లక్ష్యంగా ఉంచుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో 42,033 కార్డులను జారీ చేయడం జరిగిందని, కౌలు రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగిందన్నారు.
Similar News
News September 14, 2025
ప్రకాశం లోక్ అదాలత్లో 6558 క్రిమినల్ కేసులు పరిష్కారం

ప్రకాశం జిల్లాలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తెలిపిన వివరాల ప్రకారం.. అన్ని న్యాయస్థానాలలో లోక్ అదాలత్ జరిగింది. ఈ కార్యక్రమంలో 167 సివిల్ కేసులు, 6558 క్రిమినల్ వ్యాజ్యాలు, ప్రీ లిటిగేషన్ స్థాయిలో 4 కేసులు పరిష్కారమయ్యాయి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
News September 14, 2025
ప్రకాశం కొత్త కలెక్టర్ ముందు సవాళ్లు ఇవేనా..!

ప్రకాశం జిల్లా కలెక్టర్గా రాజాబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. గత కలెక్టర్ తమీమ్ అన్సారియాను బదిలీ చేసిన ప్రభుత్వం, జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంలో రాజాబాబును ప్రభుత్వం గుర్తించి మరీ భాద్యతలు అప్పగించింది. అయితే నూతన కలెక్టర్ ముందు తొలుత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, వెలుగొండ పూర్తి, భూ సమస్యలు సవాళ్లుగా నిలవనున్నాయి.
News September 14, 2025
24 గంటలు అందుబాటులో ఉంటా: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి, ప్రజలకు ప్రభుత్వ సేవలు దగ్గరికి చేరవేస్తానని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం బాధ్యతల అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు చేర్చడంలో తనవంతు కీలకపాత్ర పోషిస్తానన్నారు. అలాగే భూ సమస్యలు, రెవెన్యూపరమైన ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు నూతన కలెక్టర్ తెలిపారు.