News March 19, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్కు ‘స్కోచ్ అవార్డు’

ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన కలెక్టర్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల నివారణకై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకుంటారు.
Similar News
News March 19, 2025
కందుకూరు యువకుడికి గేట్లో మొదటి ర్యాంక్

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్లైన్ ద్వారా డేటా సైన్స్లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్లో MBBS పూర్తి చేశాడు.
News March 19, 2025
ఒంగోలు: ఫుడ్, బెడ్తోపాటు ఉచిత శిక్షణ

ఒంగోలు గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 11 నుంచి మే 10 వరకు నెల రోజులపాటు టైలరింగ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నెల రోజులపాటు ఉండే శిక్షణలో భోజనం, వసతి పూర్తిగా ఉచితమన్నారు. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు ఒంగోలు గ్రామీణాభివృద్ధి కార్యాలయానికి రావాలన్నారు.
News March 19, 2025
పోతురాజు కాలువ పనుల్లో అవినీతి: MLA దామచర్ల

ఒంగోలులో ఉన్న పోతురాజు కాలువ, నల్ల కాలువ సమస్యలపైన గతంలో పోతురాజు కాలువలో జరిగిన అవినీతిని, అసెంబ్లీలో MLA దామచర్ల జనార్దన్రావు ప్రశ్నించారు. మున్సిపల్ మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. పోతురాజు కాలువ ఆధునీకరణలో అవినీతి జరిగిందని MLA సభ దృష్టికి దృష్టికి తెచ్చారని తెలిపారు. దీనిపై ఇరిగేషన్ శాఖ నుంచి పూర్తి సమాచారాన్ని తీసుకొని అవినీతి చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.