News March 15, 2025
ప్రకాశం జిల్లా టీచర్కు నేషనల్ అవార్డు

ప్రకాశం జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగరాయకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ గాయత్రి విభిన్న ప్రతిభావంతుల జాతీయ సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన కార్యక్రమంలో ఆమె తన సాహిత్యాన్ని ప్రదర్శించారు. దీంతో అవార్డు అందుకున్నారు. ఆమెను స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
ప్రకాశం: డిసెంబర్ 31 జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ.!

జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించనున్నారు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,82,576 మంది పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం రూ.125కోట్ల 2లక్షల 5వేల 5వందల నిధులు విడుదలయ్యాయి. 30వ తేదీన సచివాలయ సిబ్బంది నగదును డ్రా చేయనున్నారు.
News December 27, 2025
ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.


