News December 30, 2024

ప్రకాశం జిల్లా పింఛన్‌దారులకు రూ.122‌కోట్లు విడుదల

image

ప్రకాశం జిల్లాలో 2,85,438 మంది పింఛన్ దారులకు ప్రభుత్వం రూ.122.79 కోట్లను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఈ నిధులు సోమవారమే సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేయనున్నారు. 31వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు ముందే లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించనున్నారు. జిల్లాలో గత రెండు నెలల నుంచి పింఛన్ తీసుకోని వారికి మూడు నెలలకు కలిపి ఒకేసారి ఇస్తారని కలెక్టర్ చెప్పారు.

Similar News

News October 28, 2025

ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

image

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్‌లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.