News December 11, 2024
ప్రకాశం జిల్లా రైతులకు గమనిక

ప్రకాశం జిల్లాలో కంది సాగు చేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వమే కందులు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.
Similar News
News October 13, 2025
ప్రకాశం జిల్లాలో 302 మంది అరెస్ట్.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటివరకు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 57 కేసులు నమోదు చేసినట్లు ఒంగోలులోని SP కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. జిల్లా వ్యాప్తంగా పేకాట స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 302 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద రూ. 7,09,841లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
News October 13, 2025
ప్రకాశం: కల్తీ మందును ఇలా తెలుసుకోండి..!

ములకలచెరువు, విజయవాడ సమీపంలో కల్తీ మద్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తాము తాగేది ఒరిజనల్ హా? లేదా? కల్తీనా? అని చాలా మంది సందేహ పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం APTATS పేరిట యాప్ తీసుకొచ్చింది. ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సిటిజన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కొన్న మద్యం బాటిళ్లపై ఉన్న కోడ్ అందులో ఎంటర్ చేస్తే ఒరిజనల్ లేదా? కల్తీనా అనేది తెలిసిపోతుంది.
Share It.
News October 12, 2025
హనీట్రాప్ చేసిన మార్కాపురం యువకుడు

సంగారెడ్డి జిల్లా హత్నూర్ PS పరిధిలోని కోనంపేటకి చెందిన విద్యార్థి మనోజ్ను ప్రకాశం జిల్లా యువకుడు హనీట్రాప్ చేశాడు. అనంతరం అతనివద్ద నుంచి రూ.11,20,000 వసూలు చేసిన ఘటనలో మార్కాపురం యువకుడు సంజయ్ సహా పలువురిని సంగారెడ్డి సీసీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతితో కలిసి న్యూడ్ వీడియో కాల్స్ చేయించి బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.