News September 21, 2024
ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్
ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్లో శనివారం మంత్రి లోకేశ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News September 21, 2024
ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ వచ్చిన ఎస్సైలు వీరే
▶ ఒంగోలు 1 టౌన్ – టి. త్యాగరాజు, పి. శివ నాగరాజు, జి. సుబ్రహ్మణ్యం
▶ ఒంగోలు 2 టౌన్ – అబ్దుల్ రెహమాన్, శివనాంచారయ్య
▶ ఒంగోలు 2 టౌన్ అటాచ్ DCRB – సుబ్బారావు
▶ ఒంగోలు తాలూకా – హరి బాబు, సందీప్
▶ ఒంగోలు తాలూకా అటాచ్ PCR – ఫిరోజ్, అనిత
▶ ఒంగోలు తాలూకా అటాచ్ DCRB – శ్రీనివాసరావు
▶ ఒంగోలు PCR – పి.రాజేశ్
▶ DCRB ఒంగోలు – వెంకటేశ్వరరావు
▶ పుల్లలచెరువు – సంపత్ కుమార్
▶ గిద్దలూరు – ప్రభాకర్ రెడ్డి
News September 21, 2024
ప్రకాశం జిల్లాలో 15 మంది ఎస్సైల బదిలీ
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. డిస్ట్రిక్ట్ వీఆర్లో ఉన్న 14 మంది, పుల్లల చెరువు ఎస్సైను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారందరినీ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల్లో పోస్టింగ్ ఇస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
News September 21, 2024
కనిగిరి: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లిలో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి మాలకొండయ్య సచివాలయం సమీపంలో ఉన్న బోరు మోటర్ వద్ద విద్యుత్ వైరు తెగిపడి ఉండడంతో కటింగ్ బ్లేడుతో జాయింట్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.