News March 24, 2024
ప్రకాశం: టీడీపీలోకి మాజీమంత్రి శిద్దా?

టీడీపీలోకి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా దర్శి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు టికెట్ ఇస్తామని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. మరి ఈయన పార్టీలో చేరితే పొత్తులో భాగంగా సీటు వస్తుందో రాదో చూడాలి.
Similar News
News April 21, 2025
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా<<16156012>> 629 పోస్టులు<<>> భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు.
➤ OC-259 ➤ BC-A:44 ➤ BC-B:58
➤ BC-C:08 ➤ BC-D:46 ➤ BC-E:25
➤ SC- గ్రేడ్1:08 ➤ SC-గ్రేడ్2:38.
➤ SC-గ్రేడ్3:48 ➤ ST:33 ➤ EWS: 61
➤ PHC-HH:1
News April 21, 2025
ప్రకాశం: పుట్టింటి నుంచి ఆలస్యంగా వచ్చిందని.!

పేర్నమిట్టలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పేర్నమెట్టకు చెందిన నవీన్.. భార్య శ్రావణి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆమె పుట్టినిల్లు అయిన జమ్ములపాలెంకు వెళ్లింది. అదే రోజు రమ్మని నవీన్ కోరగా ఆమె మరుసటి రోజు వచ్చింది. దీంతో అనుమానం పెంచుకున్న నవీన్ ఆదివారం ఆమె గొంతు మీద కాలు పెట్టి తొక్కడంతో ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.