News September 28, 2024
ప్రకాశం: టెట్ నిర్వహణకు నాలుగు కేంద్రాల ఎంపిక

టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణ కోసం జిల్లాలో కేంద్రాలను ఎంపిక చేసినట్లు DEO సుభద్ర పేర్కొన్నారు. అక్టోబర్ 3&21 వరకు ఉదయం 9.30 నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. (1)పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులోని కృష్ణచైతన్య విద్యాసంస్థ, (2) మార్కాపురం మండలం దరిమడుగులోని జార్జి కళాశాల, (3) ఒంగోలులో నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చి సంస్థ, బ్రిలియంట్స్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News October 21, 2025
ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.
News October 21, 2025
నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.
News October 20, 2025
నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.