News August 26, 2024
ప్రకాశం: దారి దోపిడీ.. రూ.36 లక్షలు స్వాహా

మార్టూరు మండంలో ఆదివారం భారీ దారి దోపిడి జరిగింది. CI శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. జే. పంగులూరు మండలం రామ్కూర్కు చెందిన ధనచక్రవర్తి పంట ఉత్పత్తులు, పశువులను అమ్మడం ద్వారా వచ్చిన రూ.36 లక్షల నగదును, ద్రోణాదులలోని తన అత్తగారింట్లో దాచేందుకు బైక్లో నగదుతో వెళ్తండగా.. కోనంకి- ద్రోణాదుల గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి డబ్బును అపహరించారు. దీనిపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 19, 2025
ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 19, 2025
ప్రకాశంకు భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.
News October 18, 2025
ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.