News February 16, 2025
ప్రకాశం: నిర్లక్ష్యానికి ముగ్గురు బలి

పల్నాడు జిల్లా నెమలిపురి దగ్గర అద్దంకి-నార్కెట్ పల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెసిందే. హైదరాబాద్ నుంచి మద్దిపాడుకు వస్తుండగా లారీ, కారును ఢీకొట్టింది. తల్లి, ఇద్దరు కుమారులు మృతిచెందారు. ఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Similar News
News March 17, 2026
ఒంగోలు: బస్సు ప్రయాణంలో రూ.9 లక్షల బంగారం చోరీ.. చివరికి.!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులో దొంగిలించిన 120 గ్రాముల బంగారం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు ఛేదించారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు నిందితులను గుర్తించారు. రూ.9 లక్షల విలువైన బంగారం రికవరీ చేసి SP హర్షవర్ధన్ రాజు బాధితురాలికి అందజేశారు.
News March 17, 2026
ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.
News March 17, 2026
ప్రకాశం SP పరిష్కార వేదికకు 95 అర్జీలు

ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అనూహ్య స్పందన లభించినట్లు SP కార్యాలయం పేర్కొంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదారులు పెద్ద ఎత్తున వేదికకు వచ్చినట్లు వెల్లడించింది. మొత్తం 95 అర్జీలను SP హర్షవర్ధన్ రాజు సోమవారం స్వీకరించారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి న్యాయం అందించేందుకు సంబంధిత అధికారులకు సూచించారు.


