News February 27, 2025

ప్రకాశం: పండగ పూట నలుగురు మృతి

image

పండగ పూట వివిధ కారణాల వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. గిద్దలూరులో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు మృతిచెందగా, సంతనూతలపాడు(మం) గుడిపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డెరపాలెంలో ఏడుకొండలు డాబాపై నిద్రిస్తూ నిద్రమత్తులో కింద పడి మృతి చెందాడు. మార్కాపురంలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా గడపాల్సిన పండగ పూట పలు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Similar News

News October 17, 2025

దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

image

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.

News October 17, 2025

వీరయ్య చౌదరి హత్య.. జైలు నుంచి సురేశ్ విడుదల

image

ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ 24న టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు ముప్పా సురేశ్‌ను ఆగస్ట్ 19న అరెస్ట్ చేశారు. ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ ఇచ్చింది. ఆ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి ఆదివారం ఒంగోలు తాలుకా స్టేషన్‌కు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.

News October 17, 2025

ప్రభుత్వాలు మారినా దోపిడీ ఆగడం లేదు..!

image

వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.456కోట్లు ఇవ్వగా త్వరలోనే R&R ప్యాకేజీ విడుదల చేయనుంది. సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలోని 5వేలమందికి ఈ పరిహారం అందనుంది. ఈక్రమంలో కొందరు నాయకులు పరిహారం కావాలంటే ముందుగా రూ.20వేలు ఇవ్వాలని నిర్వాసితుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. గత ప్రభుత్వంలోనూ ఇలాగే నాయకులు దోపిడీ చేయగా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎంత అడిగారో కామెంట్ చేయండి.