News February 27, 2025

ప్రకాశం: పండగ పూట నలుగురు మృతి

image

పండగ పూట వివిధ కారణాల వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. గిద్దలూరులో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసులు మృతిచెందగా, సంతనూతలపాడు(మం) గుడిపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి మద్యంలో విషం కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వడ్డెరపాలెంలో ఏడుకొండలు డాబాపై నిద్రిస్తూ నిద్రమత్తులో కింద పడి మృతి చెందాడు. మార్కాపురంలో లక్ష్మీ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా గడపాల్సిన పండగ పూట పలు గ్రామాల్లో విషాదం నెలకొంది.

Similar News

News November 27, 2025

ఉపాధ్యాయుడిపై విచారణకు త్రి మెన్ కమిటీ నియామకం

image

నాగులుప్పలపాడు మండలం బి నిడమనూరు కళాశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు వినయ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో త్రి మెన్ విచారణ కమిటీని నియమించినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా గ్రామస్థులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

News November 27, 2025

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

image

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.

News November 27, 2025

ప్రకాశం: నకిలీ బంగారంతో కేటుగాళ్ల బురిడీ

image

త్రిపురాంతకంలోని ఓ జ్యువెలర్స్ షాప్‌లో ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారం పెట్టి యజమానిని బురిడీ కొట్టించారు. 28 గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి రూ.1.50లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యటు చేపట్టారు.