News December 28, 2024
ప్రకాశం: పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారా?.

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఈనెల 30న ప్రారంభమై జనవరి 10 వరకు జరగనున్నాయి. మొత్తం 5,345 మంది హాజరు కానుండగా.. అందులో 4,435 మంది పురుషులు, 910 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా డబ్బు కడితే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎరవేస్తారని SP అన్నారు. ఎవరైనా ఇలా నగదు వసూలుకు పాల్పడితే 9121102266కు కాల్ చేయాలన్నారు.
Similar News
News November 13, 2025
మద్దిపాడు యువకుడిపై.. మార్కాపురంలో పోక్సో కేసు

మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మార్కాపురం ఎస్సై సైదుబాబు తెలిపారు. మార్కాపురానికి చెందిన బాలికను మద్దిపాడుకు చెందిన ఓ యువకుడు రెండు రోజుల కిందట తీసుకువెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
News November 13, 2025
ప్రకాశం జిల్లాలో 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో బుధవారం వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థుల్లో గ్రంథాలయాల ప్రాముఖ్యతపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
News November 12, 2025
జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తి: ప్రకాశం కలెక్టర్

జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని కలెక్టర్ రాజా బాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గృహ నిర్మాణాలకు సంబంధించి బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గృహాల నిర్మాణం ద్వారా రూ. 17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం లబ్ధిదారులకు మేలు జరిగిందన్నారు. వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మందికి రూ.18.36 కోట్ల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించిందని తెలిపారు.


