News September 24, 2024
ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 115 ఫిర్యాదులు

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుట కొరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ దామోదర్ సోమవారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Similar News
News December 27, 2025
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మళ్లీ మార్పులు.!

ప్రకాశం జిల్లాలో భాగమైన మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై పలు అభ్యంతరాలు సైతం ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఈ నేపథ్యంలో పొదిలిని ప్రకాశం జిల్లాలో, దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో కలిపే అంశం ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఈ విషయంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
News December 27, 2025
ప్రకాశం: డిసెంబర్ 31 జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ.!

జిల్లాలో డిసెంబర్ 31వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించనున్నారు. జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 2,82,576 మంది పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం రూ.125కోట్ల 2లక్షల 5వేల 5వందల నిధులు విడుదలయ్యాయి. 30వ తేదీన సచివాలయ సిబ్బంది నగదును డ్రా చేయనున్నారు.
News December 27, 2025
ప్రకాశం: చాక్లెట్లు ఇస్తానని ఇద్దరు చిన్నారులపై అత్యాచారం

ఇద్దరు చిన్నాలకు తినుబండారాలు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడిన ఘటన వైపాలెం (M)నర్సాయపాలెంలో జరిగినట్లు SI చౌడయ్య తెలిపారు. ఆంజనేయులు గ్రామంలో చిల్లర కొట్టు నడిపేవాడు. క్రిస్మస్ రోజు బాలికలకు(10,11) చాక్లెట్ల ఆశ చూపి ఓ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం, తర్వాత మరో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.


