News January 21, 2025

ప్రకాశం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త మెనూ

image

ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూను ప్రభుత్వం సవరించింది. సోమవారం ప్రకటించిన మెనూ వివరాలివి.
➤సోమవారం:తెల్ల అన్నం, సాంబారు, చిక్కీ, ఎగ్ ఫ్రై.
➤మంగళవారం: పులిహోర, పుదీనా చట్నీ, ఎగ్, రాగిజావ.
➤బుధవారం తెల్ల అన్నం, కూర, ఎగ్, చిక్కీ.
➤గురువారం: పలావు, గుడ్డు, రాగిజావ.
➤శుక్రవారం: తెల్ల అన్నం, కోడి గుడ్లకూర.
➤శనివారం: అన్నం, టమోటా పప్పు/ పప్పుచారు, తీపి పొంగల్, రాగిజావ.

Similar News

News November 26, 2025

నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ: ప్రకాశం కలెక్టర్

image

ఒంగోలులోని మెప్మా ప్రాజెక్టు పరిధిలో అవినీతి కార్యకలాపాలకు పలువురు సిబ్బంది పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెప్మా ప్రాజెక్టు పరిధిలో జరిగిన అసలు విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు జేసీ గోపాలకృష్ణ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2 వారాల్లో నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

News November 26, 2025

త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు గడువు పెంపు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా త్రీ వీలర్స్ కోసం దరఖాస్తు చేసుకునే దివ్యాంగులకు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. త్రీ వీలర్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిందని తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.

News November 26, 2025

దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్‌గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

image

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.