News January 23, 2025
ప్రకాశం: భార్యను చంపి.. కుక్కర్లో ఉడకబెట్టాడు

రాచర్ల మండలం JP చెరువుకు చెందిన మాధవిని ఆమె భర్త హత్య చేసిన ఘటన HYDలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ‘13 ఏళ్ల క్రితం మాధవితో గురుమూర్తికి వివాహమైంది. ఇటీవల గొడవపడి భార్య తలపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పింది. చనిపోయిందనుకొని మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి కుక్కర్లో వేసి ఉడికించాడు. ఎముకలు పొడిచేసి, చెరువులో పడేశాడు. ఆదివారం మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు’ అని తెలిపారు.
Similar News
News February 12, 2025
సంతనూతలపాడులో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

సంతనూతలపాడు మండలంలోని ఎం.వేములపాడు గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వేను కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. ఎంతమంది రీ సర్వే చేస్తున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించగా.. 5 టీములు భూముల రీ సర్వేలో పాల్గొంటున్నాయని వారు వివరించారు. వెంటనే రైతులకు ఫోన్ చేసిన కలెక్టర్ ఒక్క టీము మాత్రమే పాల్గొందని తెలుసుకొని 4 టీముల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సామాచారం.
News February 12, 2025
ఒంగోలు: బెంగళూరుకు ఈవీఎంలు తరలింపు

ఒంగోలు నగరం మామిడిపాలెంలోని గోదాములో ఉన్న గత ఎన్నికలలో పనిచేయని వి.వి.ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను మంగళవారం బెంగళూరులోని బెల్ కంపెనీకి అధికారులు పంపించారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు ఈ ప్రక్రియను నిర్వహించారు.
News February 12, 2025
ప్రకాశం: టెన్త్ అర్హతతో 118 ఉద్యోగాలు

మార్కాపురం డివిజన్లో 57, ప్రకాశం డివిజన్లో 61 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.