News July 6, 2024
ప్రకాశం: భార్య బైక్ అడగలేదని భర్త ఆత్మహత్య

గుడికి వెళ్లేందుకు ఇతరులను బైక్ అడిగేందుకు భార్య నిరాకరించిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముండ్లమూరు మండలం నాయుడుపాలేంలో జరిగింది. బద్రి శ్రీకాంత్(34) భార్యతో కలిసి శింగనకొండ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. భర్త భార్యను గుడికి వెళ్లడానికి ఎవరినైనా బైక్ అడగమని అడగ్గా.. భార్య నిరాకరించి బస్సులో వెళ్దామంది. దీంతో మనస్తాపానికి గురై విష రసాయనం తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
Similar News
News July 9, 2025
ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.
News July 9, 2025
ఒంగోలు: 17 నెలల చిన్నారికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

ఒంగోలులోని సత్యనారాయపురానికి చెందిన చిన్నారి అంబటి ఖశ్విని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. 17 నెలల వయస్సులోనే ఖశ్వి 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లిష్ పదాలను మాట్లాడడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. దీంతో చిన్న వయస్సులోనే అద్భుత రికార్డ్ సృష్టించిన చిన్నారిని, తల్లిదండ్రులను ప్రశంసించారు.
News July 9, 2025
బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్ఛార్జి కలెక్టర్

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.