News March 13, 2026
ప్రకాశం: మత్స్యకారుడి గొంతులో ఇరుక్కున్న బతికున్న చేప.. చివరికి

ప్రకాశం జిల్లాలో గురువారం వింత ఘటన చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లాడు. అనంతరం చేపలు పట్టి బుట్టలో వేస్తుండగా ఓ చేప ఎగిరి అతని నోటిలో పడింది. తీసేలోపే అది కాస్తా గొంతులోకి వెళ్లింది. గమనించిన తోటి మత్స్యకారులు అతణ్ని వెంటనే ఒంగోలు GGHకు తరలించారు. ENT వైద్యులు HOD డాక్టర్ ప్రభాకర్ బృందం శస్త్రచికిత్స చేసి చాపను బయటకు తీశారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా ఉన్నారు.
Similar News
News April 13, 2026
మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు

మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి పుష్కరణి వద్ద చక్రత్ ఆళ్వార్తో కలిపి పంచామృతాలతో స్నపన తిరుమంజసం తదుపరి చక్రస్నానం మహోత్సవం ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పుష్పయాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News April 12, 2026
ప్రకాశం: కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డ తండ్రి

ప్రకాశం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తాళ్లూరు(M)లో తండ్రి తన 13 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే 2, 3 రోజుల నుంచి బాలికకు కడుపు నొప్పి వస్తుండటంతో ఒంగోలు రిమ్స్ కు తరలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లూరు PS హెడ్ కానిస్టేబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 12, 2026
ప్రకాశం జిల్లాలో దారుణ హత్య

ప్రకాశం జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం ధర్మవరంలో RMP డాక్టర్ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న CI సుబ్బరాజు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


