News October 14, 2024

ప్రకాశం: మద్యం మత్తులో.. బ్లేడుతో గొంతు కోసుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకున్న సంఘటన శనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. శింగరాయకొండ పంచాయతీలోని కందుకూరు డ్రైవర్‌పేట వద్ద నివాసముంటున్న తన్నీరు శివ మహేశ్ శనివారం ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అనంతరం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అరుపులు విన్న చుట్టుపక్కల వారు గమనించి 108కి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు.

Similar News

News October 28, 2025

ప్రకాశం జిల్లాలో పునరావాసాలకు 2900 మంది

image

తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 2900 మందిని తరలించినట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మంగళవారం సాయంత్రం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మాట్లాడుతూ.. ఒంగోలు నగరంలో 30 లోతట్టు కాలనీలను గుర్తించామని, కోస్తా మండలాల్లో 10 లోతట్టు ఆవాస ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. 2 రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ప్రకాశం: ‘గర్భవతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి’

image

గర్భవతులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల గర్భవతులు అప్రమత్తంగా ఉండాలని, డెలివరీ తేదీకంటే ముందుగానే హాస్పిటల్‌లో చూపించుకోవాలని తెలిపారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఆరోగ్యాన్ని అంగన్వాడీలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరిశీలించడం జరుగుతుందన్నారు. చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News October 28, 2025

ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.