News March 13, 2025

ప్రకాశం: రూ.40లక్షల ఉద్యోగం.. అయినా సూసైడ్

image

గిద్దలూరులో హైటెన్షన్ కరెంట్ వైర్‌ పట్టుకున్న విద్యార్థి చనిపోయాడు. కంభం(M) రావిపాడుకు చెందిన అమరనాథ్(22) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రూ.40 లక్షల జీతంతో జాబ్‌కు సెలెక్టయ్యాడు. HYDలో అన్నను చూసొస్తానని చెప్పి వెళ్లాడు. అన్నను కలవకుండానే ఫ్రెండ్‌తో కలిసి నిన్న గిద్దలూరు వచ్చాడు. ఫ్రెండ్‌ని వాటర్ బాటిల్‌కి పంపి అతను గూడ్స్ రైలెక్కి వైర్లు పట్టుకున్నాడు. కర్నూలులో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News March 22, 2025

ప్రకాశం: బెట్టింగ్ వేయకండి.. కాల్ చేయండి

image

ఐపీఎల్ వినోదం ఇవాళ్టి నుంచే మొదలు కానుంది. ఈక్రమంలో బెట్టింగ్ భూతం భయపడుతోంది. ఒంగోలు నగరంతో పాటు మారుమూల పల్లెల్లోని యువతను సైతం బెట్టింగ్‌‌లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 100, 112 నంబర్లతో పాటు 91211 02266కు కాల్ చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.

News March 22, 2025

ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

image

క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.

News March 21, 2025

ఒంగోలు: పసికందు హత్య.. తండ్రికి యావజ్జీవ శిక్ష.!

image

భార్య పైన అనుమానంతో మూడేళ్ల పసికందును హత్య చేసిన కసాయి తండ్రి ఖాదర్‌కి ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి భారతి గురువారం యావజ్జీవ శిక్ష విధించారు. చీమకుర్తిలో భార్య సాల్మాతో కలిసి భర్త ఖాదర్ నివాసం ఉంటూ కూలి పనులకు వెళ్లేవాడు. ఏడేళ్ల క్రితం భార్యపై అనుమానంతో కుమారుడు సాహుల్ గొంతు కోసి హత్య చేశాడు. నింద రుజువైనందున ఎట్టకేలకు ఏడేళ్లకు అతనికి యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది.

error: Content is protected !!