News May 20, 2024
ప్రకాశం: రెండేళ్లల్లో 45 మంది మృతి

ఒంగోలు-కర్నూలు రహదారి రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. చీమకుర్తి, సంతనూతలపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గడిచిన రెండేళ్లలో 120కి పైగా రోడ్డు ప్రమాదాలు, 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ రహదారిపై నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలు కూడా నడుస్తుంటాయి. ఇప్పటికే ఆ రోడ్డులో 16 బ్లాక్ స్పాట్లు గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆ రోడ్డు అంటే కొంతమందికి భయమే.
Similar News
News November 22, 2025
ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.
News November 22, 2025
ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.


