News February 9, 2025

ప్రకాశం: రేపటినుంచి పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి 20వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలను నిర్వహించాలని తెలిపారు.

Similar News

News April 25, 2025

చీరాల ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ!

image

ఉమ్మడి ప్రకాశం(D)లో రాజకీయంగా కీలక స్థానమైన చీరాలలో పాలిటిక్స్ వేడెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. దీంతో తదుపరి ఛైర్మన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, సూరగాని లక్ష్మి తదితరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ ఉత్కంఠకు తెర పడనుంది.

News April 25, 2025

మార్కాపురం: ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు’

image

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే సహించేది లేదని మార్కాపూరం పట్టణ ఎస్సై సైదు బాబు హెచ్చరించారు. గురువారం పట్టణ శివారు ప్రాంతంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులను ఆయన గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని హితవు పలికారు. ఏవరైనా ఇలా దోరికితే కఠిన చర్యలు ఉంటాయని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

News April 25, 2025

పోలీసులకు సవాల్‌గా మారిన వీరయ్య హత్య కేసు?

image

మంగళవారం రాత్రి ఒంగోలులో జరిగిన వీరయ్య హత్య కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు ఐదుగురు అనుమానితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే హత్య జరిగిన ప్రదేశానికి స్థానిక పోలీస్ స్టేషన్‌కు 500 మీటర్లు ఉంది. హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి ఎస్పీ వెళ్లడానికి అరగంట పట్టింది. ఈ సమయంలో చుట్టుపక్కల చెక్‌పోస్టులను అలర్ట్ చేసి ఉంటే దుండగులు దొరికే వారని పలువురు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!