News October 9, 2024
ప్రకాశం: రైతు బజార్ కేంద్రాల్లో టమాటాలు విక్రయాలు

ప్రకాశం జిల్లాలోని అన్ని రైతు బజార్ కేంద్రాలలో నిన్నటి నుంచి రాయితీపై టమాటాలు అందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒక కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నామన్నారు. ఒక కుటుంబానికి రెండు కిలోలు మాత్రమే అందిస్తామని, తమ వెంట ఆధార్ జిరాక్స్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ను తమ వెంట తీసుకుని రావాలని కోరారు. అవకాశాన్ని ప్రజల వినియోగించుకోవాలన్నారు.
Similar News
News January 5, 2026
కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 5, 2026
మార్కాపురం కొత్త జిల్లా.. కాకమీదున్న పాలిటిక్స్!

మార్కాపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. జిల్లాలో అంతర్భాగమైన Y పాలెం పాలిటిక్స్ హీట్ పీక్స్కు చేరింది. MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రొటోకాల్ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలపై టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో ప్రొటోకాల్ గుర్తులేదా అంటూ ఎరిక్షన్ బాబు ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య విమర్శల జోరు ఊపందుకుంది.
News January 4, 2026
పారిశుద్ధ్య కార్మికులకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

కొండపి, టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం మంత్రి స్వామి ఒంగోలు కలెక్టరేట్ ఆవరణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ మల్లికార్జున్ ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు ఈ ఆటోలు ఉపయోగపడతాయన్నారు.


