News March 23, 2024
ప్రకాశం: వైసీపీ MLAపై కేసు నమోదు

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారనే ఆరోపణలపై గిద్దలూరు MLA రాంబాబుపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. ఈ నెల 18న మార్కాపురంలో షాదీఖానా స్లాబ్ నిర్మాణ పనుల్లో ఆయనతోపాటు రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ అలిబేగ్, 20వ వార్డు కౌన్సిలర్ షేక్ సలీం పాల్గొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా వారిపై కేసు నమోదు చేయించారు.
Similar News
News February 15, 2025
వెలిగండ్ల మండలంలో సూపర్వైజర్ ఆత్మహత్య

వెలిగండ్ల మండలంలోని పద్మాపురంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం లేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే ఫైవ్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న ఏనుగు ప్రతాపరెడ్డి శనివారం ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ భీమా నాయక్, ఎస్ఐ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 15, 2025
కందుకూరు: చంద్రబాబు ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి.!

సీఎం చంద్రబాబు కొద్ది సేపట్లో కందుకూరు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చే అంశంపై ఆయన ఏం చెప్తారో అన్న ఆసక్తి నియోజకవర్గ ప్రజలలో నెలకొంది. కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేరుస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు వాగ్దానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
News February 14, 2025
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి మృతి

పల్నాడు జిల్లా శావల్యాపురంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు పెద్దారవీడుకు చెందిన రమణగా గుర్తించారు. గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాకు వస్తుండగా.. శావల్యాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.