News April 5, 2024
ప్రకాశం: వ్యక్తి ఆత్మహత్య
సంతమాగులూరు మండలం పుట్ట వారిపాలెం గ్రామంలోని ప్రమీల సీడ్స్ యజమాని చిరుమామిళ్ల సురేంద్ర గురువారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఉదయం దుకాణానికి వచ్చిన సురేంద్ర పురుగు మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లాడు. ఇది గమనించిన షాపులోని గుమస్తా బాధితుడిని హుటాహుటీన నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సురేంద్రకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
Similar News
News January 15, 2025
అద్దంకి: తెప్పోత్సవానికి భారీ బందోబస్తు
అద్దంకి, సింగరకొండపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నేడు తెప్పోత్సవానికి నిర్వహిస్తున్నారు. సందర్భంగా ఆలయాన్ని అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశం ఉండటంతో.. అద్దంకి టౌన్, రూరల్ సీఐలు కృష్ణయ్య, మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో మేదరమెట్ల, కొరిశపాడు, అద్దంకి SIలు మహమ్మద్ రఫీ, సురేశ్, ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News January 15, 2025
చీరాల: గంట వ్యవధిలో గుండెపోటుతో అన్నదమ్ముల మృతి
చీరాల గొల్లపాలెంలో బుధవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. గంటల వ్యవధిలో అన్నదమ్ములు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపాలెంకు చెందిన గొల్లప్రోలు గంగాధర్ (40) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే గంగాధర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నయ్య మృతి తట్టుకోలేని తమ్ముడు గోపి( 33) అదే వైద్యశాలలో గుండెపోటుతో మరణించాడు.
News January 14, 2025
పొదిలి: బలవర్మరణం కేసులో ట్విస్ట్
పొదిలి పట్టణంలో గత ఏడాది రవి అనే వక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈకేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దళితనేత నీలం నాగేంద్రం జిల్లా ఎస్పీ దామోదర్ను మృతుడి భార్య సలొమితో కలిసి ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చాలని చేసిన విజ్ఞప్తి మేరకు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం కేసును సోమవారం ఎస్సీ, ఎస్టీ కేసుగా మార్చారు.