News September 21, 2024

ప్రకాశం: సీఎం చంద్రబాబుకు 53 వినతి పత్రాలు

image

నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో శుక్రవారం ‘ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం’జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న చంద్రబాబు ప్రజల నుంచి 53 వినతి పత్రాలు స్వీకరించారని సంబంధిత అధికారి శ్రీనివాసులు తెలియజేశారు. రెవిన్యూ సమస్యలపై 11, పెన్షన్ మంజూరుకు 8, వివిధ ప్రభుత్వ పథకాలు, ఆరోగ్యసమస్యలపై 4, రోడ్లు అభివృద్ధి చేయాలని 12, ఇళ్ల మంజూరుకు 4, ఉద్యోగాల కోసం 11, విద్యుత్ సమస్యలపై 2 వినతులు వచ్చాయన్నారు.

Similar News

News September 21, 2024

కనిగిరి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

కనిగిరి మండలంలోని నేలటూరి గొల్లపల్లిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి మాలకొండయ్య సచివాలయం సమీపంలో ఉన్న బోరు మోటర్ వద్ద విద్యుత్ వైరు తెగిపడి ఉండడంతో కటింగ్ బ్లేడుతో జాయింట్ చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News September 21, 2024

హైకోర్టు జడ్జిని కలిసిన ఎస్పీ, కలెక్టర్

image

ఒంగోలుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి, ప్రకాశం జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి యన్ వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, కలెక్టర్ తమిమ్ అన్సారీయా, జిల్లా జడ్జీ భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం వారు జిల్లాలోని పలు విషయాల గురించి చర్చించారు.

News September 21, 2024

ప్రకాశం జిల్లా వాసికి కష్టం.. సాయం చేసిన లోకేశ్

image

ప్రకాశం జిల్లా పుల్లలచెరువుకు చెందిన వేముల నాగరాజు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. నాగరాజు కుటుంబ సభ్యులు ట్విటర్ ద్వారా మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.7లక్షలు అందించారు. ఈ నేపథ్యంలో నాగరాజు కుటుంబ సభ్యులు ఉండవల్లి ప్రజాదర్బార్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.