News March 2, 2025
ప్రకాశం: సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘అమరావతి నిర్మాణం కోసం రూ.6 వేల కోట్ల నిధులు, రూ.50 వేల కోట్ల పనులు, రూ.15 వేల కోట్ల అప్పులు కల్పించారు. ప్రకాశం జిల్లా వాళ్లం కేవలం తాగునీరు, సాగునీరు అడుగుతున్నాం. రూ.600 కోట్లయినా నిధులు మాకు ఇస్తే గొంతు తడి చేసుకుంటాం. దప్పికకు కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఉండవ్ చంద్రబాబు” అంటూ ఎమ్మెల్యే ట్వీట్ చేశారు.
Similar News
News November 6, 2025
ఒంగోలులో తొలిసారి షూటింగ్ టోర్నమెంట్.!

ప్రకాశం జిల్లాకు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి షూటింగ్ టోర్నమెంట్ ఒంగోలులో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈనెల 7, 8, 9న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో షూటింగ్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. 700మంది క్రీడాకారులు తరలి వస్తారని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. టోర్నీ గురించి కలెక్టర్ రాజాబాబుతో డీఈఓ బుధవారం చర్చించారు.
News November 6, 2025
వెలుగొండ ప్రాజెక్ట్కు రానున్న మంత్రి నిమ్మల

నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు,రేపు దోర్నాలలో పర్యటించనున్నారు. నేటి రాత్రికి ఆయన దోర్నాలకు చేరుకుంటారు. రేపు ఉదయం కొత్తూరు వద్ద బ్రీచ్ అయిన తీగలేరు వాగును పరిశీలిస్తారు. అనంతరం వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ సందర్శిస్తారు. ఇటీవల ‘మొంథా’ తుఫాను ప్రభావంతో ప్రాజెక్టులోకి నీరు చేరిన నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి కార్యాలయం తెలిపింది.
News November 5, 2025
ప్రకాశం: ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త

రాష్ట్రంలో ఇల్లులేని పేదలకు కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా గృహాలను మంజూరు చేయనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాలో సర్వే ప్రారంభించారు. తాజాగా సర్వే <<18185186>>గడువును నవంబర్ 30 వరకు<<>> పొడిగించినట్లు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. గృహాల మంజూరు కోసం జాబ్ కార్డు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు స్థానిక అధికారులను సంప్రదించాలన్నారు.


