News May 10, 2024

ప్రకాశం: సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్

image

జిల్లాలో మొత్తం 2,183 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,340 సెంటర్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అందులో యర్రగొండపాలెం నియోజకవర్గంలో 162, దర్శిలో 187, సంతనూతలపాడులో 163, ఒంగోలులో 193, కొండపిలో 168, మార్కాపురంలో 147, గిద్దలూరులో 168, కనిగిరిలో 152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అంటే సగానికి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ జరగనుంది.

Similar News

News February 19, 2025

ఒంగోలు కోర్టులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు

image

మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి టి.రాజవెంకటాద్రి తీర్పు ఇచ్చారు. రత్నంబాబు కరిష్మా అనే యువతిని ప్రేమించాడు. అది నచ్చని యువతి కుటుంబ సభ్యులు రత్నంబాబును కత్తులతో పొడిచి హత్య చేశారు. నేరం రుజువు కావడంతో వీరికి మంగళవారం శిక్ష ఖరారైంది.

News February 19, 2025

ఒంగోలు: రెవెన్యూ సదస్సుల అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

image

రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండల తహశీల్దార్లతో జేసీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించినందున, వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని JC ఆదేశించారు.

News February 18, 2025

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

*మద్దిపాడులో పర్యటించిన సినీనటి గౌతమి
*ప్రకాశం జిల్లా ప్రజలను వణికిస్తున్న GBS వైరస్
*యర్రగొండపాలె తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
*పల్నాడులో దోర్నాల మహిళ మృతి
*కంభం: పెళ్లై 3రోజులే… అంతలోనే వధువు సూసైడ్
*రాచర్లలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు*
*నల్లమల అడవుల్లో ఉచ్చులు పెడితే.. ఏడేళ్ళ జైలు శిక్ష

error: Content is protected !!