News March 16, 2025

ప్రకాశం: 10వ తరగతి ఎగ్జాం సెంటర్లలో సీసీ కెమెరాలు

image

ప్రకాశం జిల్లాలో సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 9 లైవ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఆరు సమస్యాత్మకమైన కేంద్రాలను గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్‌కు పాల్పడకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఎగ్జాం సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

Similar News

News November 8, 2025

జిల్లా స్థాయి పోటీలకు మార్కాపురం విద్యార్థుల ఎంపిక

image

ప్రకాశం జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ అండర్-14 లో మార్కాపురం బాలురు సత్తా చాటారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న వి.మహేష్ 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం, 200 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించారు. ఎం. అజయ్ 400, 600 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.

News November 8, 2025

ముండ్లమూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

ముండ్లమూరు మండలం వేంపాడు-పోలవరం మధ్యలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అద్దంకి నుంచి వస్తున్న ఇద్దరు యువకులు ట్రాక్టర్‌ను క్రాస్ చేసే క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. చాట్ల వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, షేక్ సుభానిని 108లో అద్దంకి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 7, 2025

రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

image

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.