News March 5, 2025

ప్రకాశం: APAMT ఒలింపియాడ్‌లో కీర్తి ప్రతిభ

image

కొండేపిలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని పి.కీర్తి APAMT మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ -2024లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించినట్లు ప్రిన్స్‌పల్ ఎస్.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది నవంబర్ 30న 51వ రాష్ట్ర అసోషియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అధ్వర్యంలో నిర్వహించగా గతవారం విడుదల చేసిన ఫలితాల్లో మొదటి స్థానం సాధించినట్లు చెప్పారు. కీర్తిని ఈసందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.

Similar News

News January 8, 2026

మార్కాపురం: వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కాం: ఎస్పీ

image

వృద్ధులే లక్ష్యంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. సీబీఐ, ఈడీ కోర్టు అధికారులమని చెప్పి మీ పిల్లలపై కేసు ఉంది.. ఇప్పుడే అరెస్టు చేస్తామని భయపెట్టి డబ్బులు దోచుకోవడమే డిజిటల్ అరెస్ట్ అన్నారు. అపరిచిత వీడియో కాల్ ఎత్తవద్దని, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దన్నారు. సైబర్ క్రైమ్ బాధితులైతే 1930కి కాల్ చేయండాని సూచించారు.

News January 8, 2026

మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

image

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

News January 8, 2026

మీ సమస్యలను సీఎంకు చెబుతా: గొట్టిపాటి

image

ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పలువురు రైతులు మంత్రి గొట్టిపాటికి బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను భారీగా పెంచడంతో డిమాండ్ తగ్గి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.