News May 10, 2024
ప్రకాశ: పత్రికలకు, నాయకులకు కలెక్టర్ సూచనలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈనెల 12, 13 తేదీల్లో పత్రికల్లో ప్రచురించే ప్రకటనలకు సంబంధించి పోటీలో ఉండే రాజకీయ అభ్యర్థులు రెండు రోజులు ముందుగానే ఎంసీఎంసీ ధ్రువీకరణ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. పత్రికల యాజమాన్యాలు కూడా ధ్రువీకరణ ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థుల ప్రకటనలను ప్రచురించకూడదని సూచించారు.
Similar News
News February 18, 2025
యర్రగొండపాలెం తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు

యర్రగొండపాలెం తహశీల్దార్పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.
News February 18, 2025
టెట్ విషయంలో లోకేశ్పై ప్రకాశం MLA సెటైర్లు

మంత్రి లోకేశ్పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి X వేదికగా కామెంట్ చేశారు.”బాబు లోకేశ్ గారు మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, జగనన్న హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. 9 నెలల తర్వాత అడుగుతున్నా. మీ హెరిటేజ్ సంస్థ షేర్ పెరిగిందని, సంతకం పెట్టిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు దొర.? అని ట్వీట్ చేశారు.
News February 18, 2025
ప్రకాశం: SP పరిష్కార వేదికకు 81 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలువైపుల నుంచి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ వేదికకు 81 ఫిర్యాదుల అందినట్లు ఎస్పీ తెలిపారు. ఫిర్యాదుల గురించి సవివరంగా అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.