News February 12, 2025

ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలు పునరుద్ధరణ

image

ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై రాకపోకలను పునరుద్ధరించారు. గత సెప్టెంబర్ నెలలో వరదలకు దెబ్బతిన్న వంతెన మరమ్మతులు పూర్తి చేసి, మంగళవారం సాయంత్రం నుంచి వాహన రాకపోకలను అనుమతించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడుతూ.. వరదల సమయంలో ప్రకాష్ నగర్ వంతెన 9 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అధికార యంత్రాంగం ఆధునిక టెక్నాలజీ వినియోగించి పనులు పూర్తి చేసిందన్నారు.

Similar News

News December 16, 2025

మూడో విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో రేపు జరగనున్న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సింగరేణిలోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు, కౌంటింగ్ 2 గంటల నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News December 16, 2025

ఖమ్మం జిల్లాలో పరిశ్రమల విస్తరణకు చర్యలు: కలెక్టర్

image

రఘునాథపాలెం మండలం జింకల తండా, పువ్వాడ నగర్ పరిధిలో టీజీఐఐసీకి కేటాయించిన భూములను మంగళవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత, రహదారి అనుసంధానం, మౌళిక వసతుల లభ్యతపై అధికారులతో చర్చించారు. భూముల సరిహద్దులను మ్యాప్‌ల ఆధారంగా సర్వే చేసి కేటాయించాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లాను పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.

News December 16, 2025

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఖమ్మం సీపీ

image

మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి మండలంలోని పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం సందర్శించారు. ముందుగా కారేపల్లిలో గల పోలింగ్ కేంద్రంలో బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రతిఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.