News March 5, 2025
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములం అవుదాం: కలెక్టర్

మానవ మనుగడకు కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగ స్వాములు కావాలని.. దశల వారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నం.1లో నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. మంగళవారం విజయవాడ రైతు సాధికార సంస్థ ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయం-ఖరీఫ్ కార్యాచరణ ప్రణాళికపై వర్క్షాప్ జరిగింది.
Similar News
News November 19, 2025
ఎంజీయూ డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల కొత్త తేదీలు విడుదల

MGU పరిధిలో వాయిదా పడిన డిగ్రీ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల (రెగ్యులర్/బ్యాక్లాగ్) రివైజ్డ్ టైమ్ టేబుల్ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.ఉపేందర్ రెడ్డి బుధవారం విడుదల చేశారు. గ్రూప్ ‘ఏ’ కాలేజీలు డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో, గ్రూప్ ‘బి’ కాలేజీలు డిసెంబర్ 5, 6, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అదే షెడ్యూల్లో ఎస్ఈసీ (SEC) & జీఈ (GE) పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
News November 19, 2025
ప్రెగ్నెన్సీలో అవకాడో తింటే..

అవకాడో గర్భిణులకు ఔషధ ఫలం అంటున్నారు నిపుణులు. ఇది సంతానోత్పత్తి, పిండం అభివృద్ధి, జనన ఫలితాలు, తల్లి పాల కూర్పును ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరం విటమిన్లను శోషించుకునేలా చేస్తాయి. అధిక పీచువల్ల ఆకలి తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అలాగే ఫోలిక్ ఆమ్లం గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ లోపాలు రాకుండా చూస్తుందని చెబుతున్నారు.
News November 19, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి బడిబాటి పిల్లల సర్వే

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు బడిబాట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. సీఆర్పిలు, ఐఈఆర్పీలు DLM T తమ ప్రాంతాల పరిధిలో బడిబాట పిల్లల సర్వేలు నిర్వహించాలని సూచించారు. బర్త్ డే పిల్లల వివరాలను ప్రబంధ పోర్టల్లో వెంటనే నమోదు చేయాలని ఆదేశించారు.


