News March 5, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో భాగ‌స్వాముల‌ం అవుదాం: కలెక్టర్

image

మాన‌వ మ‌నుగ‌డ‌కు కీల‌క‌మైన ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉద్య‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌ స్వాములు కావాల‌ని.. ద‌శ‌ల వారీ కార్యాచ‌ర‌ణ‌తో స‌హ‌జ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నం.1లో నిలిపేందుకు స‌మష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌ రైతు సాధికార సంస్థ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాల‌యంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం-ఖ‌రీఫ్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. 

Similar News

News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.

News November 7, 2025

స్కూళ్లకు ఈ రెండో శనివారం నో హాలిడే: DEO

image

ఇటీవల తుఫాను ధాటికి తిరుపతి జిల్లాలో స్కూళ్లకు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సెలవులకు ప్రత్యామ్నాయంగా పాఠశాలలు పనిచేయాల్సిన తేదీలను డీఈవో కుమార్ వెల్లడించారు. నవంబర్ 8, డిసెంబర్ 13, జనవరి 10, ఫిబ్రవరి 14వ తేదీల్లో పాఠశాలలు కచ్చితంగా పనిచేయాలన్నారు. ఏ పాఠశాలకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News November 7, 2025

తొర్రేడు: తండ్రిని హతమార్చిన తనయుడు

image

రాజమండ్రి మండలం తొర్రేడులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. కూతురు వివాహం విషయంలో తండ్రి అప్పారావును కొడుకు వడిశెల సాయికుమార్ దారుణంగా హత్య చేశాడని రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ గురువారం రాత్రి తెలిపారు. పెళ్లి విషయంలో చెల్లెలిని తండ్రి తిట్టడంతో కోపోద్రిక్తుడైన సాయికుమార్ కూరగాయలు కోసే కత్తితో అప్పారావు పీక కోసి హత్య చేసినట్లు వెల్లడించారు. సాయికుమార్ పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.