News March 5, 2025

ప్ర‌కృతి వ్య‌వ‌సాయంలో భాగ‌స్వాముల‌ం అవుదాం: కలెక్టర్

image

మాన‌వ మ‌నుగ‌డ‌కు కీల‌క‌మైన ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉద్య‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌ స్వాములు కావాల‌ని.. ద‌శ‌ల వారీ కార్యాచ‌ర‌ణ‌తో స‌హ‌జ సాగులో ఎన్టీఆర్ జిల్లాను నం.1లో నిలిపేందుకు స‌మష్టి కృషి అవ‌స‌ర‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌ రైతు సాధికార సంస్థ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ విభాగం జిల్లా ప్రాజెక్టు కార్యాల‌యంలో ప్ర‌కృతి వ్య‌వ‌సాయం-ఖ‌రీఫ్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌పై వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. 

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

image

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.

News November 20, 2025

ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్‌లో 10 మంది మిస్సింగ్!

image

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్‌కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.

News November 20, 2025

NZB: గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. అయితే ఈనెల 10న కిసాన్ గంజ్ మార్కెట్ వద్ద ఓ వ్యక్తి పడి ఉండగా స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ ఈనెల15న మృతి చెందాడు. మృతుడికి సంబంధించి వివరాలు తెలియ రాలేదని, ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ నువ్వు సంప్రదించాలని తెలిపారు.