News April 3, 2025
ప్రకృతి వ్యవసాయ జిల్లాగా పార్వతీపురం: కలెక్టర్

జిల్లాలో సాధ్యమైనంత వరకు ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయ జిల్లా దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక రంగాల వృద్ధిపై కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. జిల్లాలో 4,800 ఎకరాల వరకు పైనాపిల్ సాగు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, కేవలం 250 ఎకరాల విస్తీర్ణంలో సాగు జరగడం పట్ల కలెక్టర్ ఆరా తీశారు.
Similar News
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.
News November 18, 2025
ALERT: ఫోన్ IMEI నంబర్ మారుస్తున్నారా?

ఫోన్లలోని 15 అంకెల IMEI నంబర్ను మార్చడం నాన్ బెయిలబుల్ నేరం కిందికి వస్తుందని టెలికం శాఖ హెచ్చరించింది. మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తయారీదారులు, బ్రాండ్ ఓనర్లు, ఇంపోర్టర్లు, సెల్లర్లకు అడ్వైజరీ జారీ చేసింది. నిబంధనలకు లోబడి ఉండాలని సూచించింది. ఐఎంఈఐని మార్చేందుకు ఉపయోగించే పరికరాలను కలిగి ఉండటం కూడా నేరమేనని వార్నింగ్ ఇచ్చింది.
News November 18, 2025
గద్వాల: హత్యాయత్నం కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

అటెంప్ట్ మర్డర్ (హత్యాయత్నం) కేసులో నిందితులైన కుర్వ గోకారి, కాశన్నలకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించారు. నిందితులకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. రాజోలి మండలం బుడమోర్సు గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీనారాయణ 06/03/2018న వారిపై ఫిర్యాదు చేశారు.


