News February 5, 2025
ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల అధిక లాభాలు వస్తాయని సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో రైతుల అవగాహన కోసం 5 మోడల్ ప్రాజెక్టులు ఎంపిక చేయాలని సూచించారు.
Similar News
News October 26, 2025
సిరిసిల్ల: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికో.. ?

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మద్యం పాలసీ 2025-27కు ఎక్సైజ్ అధికారులు రేపు డ్రా తీయనున్నారు. జిల్లాలోని మొత్తం 48 దుకాణాలకు 1,381 దరఖాస్తులు వచ్చాయని, దీంతో రూ.41.43 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. జిల్లెల వైన్స్కు అత్యధికంగా 53 దరఖాస్తులు రాగా, రుద్రంగి వైన్స్కు అత్యల్పంగా 15 దరఖాస్తులు వచ్చాయి. రేపటి లక్కీ డ్రాలో టెండర్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.
News October 26, 2025
నెల్లూరు: గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి సర్వే

నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా ఆదేశాలతో మనుబోలు మండలం- పల్లిపాలెం గ్రామంలో గిరిజనుల ఇళ్ల నిర్మాణం కోసం ఆదివారం హౌసింగ్ అధికారులు సర్వే నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు తమకు ఇల్లు లేవని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో సర్వేచేసి అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని హౌసింగ్ ఏఈ శరత్బాబు తెలిపారు.
News October 26, 2025
మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.


